Home Blog నవంబర్ 15వ తేదీన విడుదల కాబోతున్న #SSMB 29 టీజర్-రామోజీ ఫిలిం సిటీలో 25 వేలమంది అతిధుల సమక్షంలో, ఘనంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

నవంబర్ 15వ తేదీన విడుదల కాబోతున్న #SSMB 29 టీజర్-రామోజీ ఫిలిం సిటీలో 25 వేలమంది అతిధుల సమక్షంలో, ఘనంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శక ధీరుడు S.S.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం #SSMB 29 టీజర్ నవంబర్ నెలలో విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆగష్టు 9,2025 న జరిగిన ఒక ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ ఫస్ట్ అధికారిక టీజర్ నవంబర్, 2025 లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు, ఆ టీజర్ని ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలుస్తుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సినిమా పేరు “గ్లోబ్ ట్రౌటర్” అని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి #SSMB 29 టీజర్ని నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో, 25 వేలమంది అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా రాజమౌళి టీం ఈ డేట్ ని ఇంతవరకు బయటకు అనౌన్స్ చేయలేదు.

ఈ సినిమాకి “వారణాసి” అని “జెన్ 63” అని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఈవెంట్లో సినిమా పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది.

#SSMB 29 సినిమా విశేషాలు :

దర్శకుడు : S.S.రాజమౌళి

తారాగణం : సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు

నేపథ్యం : ఇండియానా జోన్స్ తరహాలో ఆధ్యాత్మిక టచ్ ఉన్న జంగల్ అడ్వెంచర్ మూవీగా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.

నిర్మాణం : కే.ఎల్.నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బేనర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో పురాతన కాశీ నగరాన్ని పోలిన భారీ సెట్ ని కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం హైదరాబాద్ లోనే కాకుండా సౌత్ ఆఫ్రికా, ఒరిస్సాలలో కూడా చిత్రీకరణ జరుపుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here