అక్కినేని నాగార్జున ప్రస్తుతం వయస్సు 66 సంవత్సరాలు, కానీ ఆయన గురించి తెలియనివారెవరయినా ఆయనను చూస్తే 40-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉంటుందని అనుకుంటారు. వాస్తవానికి, ఇప్పుడు నలభయ్ సంవత్సరాల వయస్సు ఉన్నవాళ్లు చాలా మంది కంటే ఆయన చిన్నవారిలా కనబడుతున్నారు. నాగార్జున కొన్ని దశాబ్దాలుగా చాలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని గడుపుతున్నారు. ఫిట్నెస్ మీద చాలా శ్రద్ధ, ప్రతి రోజూ వ్యాయామం చేయటం,వలన ఆయన వయస్సు శరీరాకృతిలో కనిపించటం లేదు.
ఈ సంవత్సరం నాగార్జున నటించిన “కూలీ” చిత్రం లో ఆయన లుక్, స్టైల్ తమిళ ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. యువత ఆయన స్టైల్ ను, ఫాషన్ ను అనుకరిస్తూ వీడియోలు చేసారు. యువతులు కొన్ని వీడియోలలో ఆయనను తమ క్రష్ గా చెప్పుకున్నారు. ఆ సినిమా ప్రమోషన్లు చెన్నైలో జరిగినప్పుడు, మీడియా వాళ్ళు, యాంకర్లు మాత్రమే కాక సెలిబ్రిటిలు సైతం ఆయనను చూసి ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు, తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి సైతం నాగార్జునను చాలా పొగడ్తలతో ముంచెత్తాడు. ఇటీవల చెన్నైలో జరిగిన జియో హాట్ స్టార్ వాళ్ళ ఈవెంట్ కి నాగార్జున, మోహన్ లాల్ , విజయ్ సేతుపతి గెస్టులుగా హాజరు అయ్యారు. ఈ ఈవెంట్ లో మోహన్ లాల్ ముందే నాగార్జునను విజయ్ సేతుపతి పొగడ్తలతో ముంచెత్తాడు.
తాను చిన్నప్పుడు మొట్ట మొదటి సారి నాగార్జునను చూసినప్పుడు ఆయన ఎలా ఉన్నాడో, ఇప్పటికి సరిగ్గా అలాగే ఉన్నాడు. ఈయనకు వయస్సు ఎందుకు పెరగటం లేదో నాకు అర్ధం అవటం లేదు. కాబట్టి ఎవరయినా ఆయన గ్లామర్ రహస్యాన్ని కనిపెట్టడానికి రీసెర్చ్ స్టడీ చేస్తే బాగుంటుంది. చాలా సంవత్సరాలుగా నాగార్జున హెయిర్ స్టైల్ కూడా అలాగేఉంది, ఆయన ఎనర్జీ లెవెల్స్ లో కొంచెం కూడా తగ్గలేదు. నేను ముసలివాడ్ని అయ్యిపోయి నా మనవళ్లు , ముని మనవళ్లు వచ్చినా ఈయన ఇట్లానే ఉంటారేమో !? ,అని విజయ్ సేతుపతి చెప్పగానే , ప్రేక్షకులతో నిండిపోయిన ఆడిటోరియం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. నాగార్జున ఈ పొగడ్తలకు చిన్న చిరునవ్వుతో బదులిచ్చాడు.
ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు చాలా సీజన్స్ కి నాగార్జున హోస్టుగా ఉన్నారు. తమిళ్ బిగ్ బాస్ నుండి కమల్ హాసన్ తప్పుకున్న తరువాత, విజయ్ సేతుపతి ప్రస్తుతం తమిళ బిగ్ బాస్ కి హోస్టుగా వ్యవహరిస్తున్నారు.
టాలీవుడ్ లో ప్రస్తుతం టెక్నాలజీ వినియోగం బాగా పెరిగిపోయింది. అతిగా, అవసరం లేకపోయినా టెక్నాలజీ ని సినిమాలలో వినియోగించటం పై బాలయ్య తాజాగా వ్యంగాస్త్రాలు సంధించారు. గోవా లో ప్రస్తుతం జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ వేడుకలలో అతిధిగా హాజరయిన బాలకృష్ణ మీడియా తో ముచ్చటించారు.
“వినోద పరిశ్రమ అయినా సినిమాలో, సాంకేతిక పరిజ్ఞానాన్ని అవసరాన్ని మించి వాడటం వలన, ఏది నిజమో,ఏది టెక్నాలజీ యో తెలియక ప్రేక్షకులను తికమక పడుతున్నారు. నేను సినిమా పరిశ్రమలో గత 50 సంవత్సరాలుగా పని చేస్తున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ గారి కుమారునిగా ఆయన నట వారసత్వాన్ని కొనసాగిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా గమనిస్తూ, నేను నేర్చుకున్నవి చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. కానీ, ప్రస్తుతం సినిమా నిర్మాణంలో అవసరం లేకపోయినా, టెక్నాలజీని అతిగా వినియోగించటం ఎక్కువ అయ్యింది. నేనయితే టెక్నాలజీని అవసరమయితేనే ఉపయోగిస్తాను. ఎందుకంటే నేను డూప్లికేటుని కాను, నేను ఒరిజినల్. ” అని అన్నారు.
ప్రస్తుతం బాలకృష్ణ నటించిన “అఖండ -2” (తాండవం) చిత్రం, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 5 వ తారీఖున విడుదలకు తుది మెరుగులు దిద్దుకుంటుంది. అభిమానుల్లో ఈ చిత్రం పై విపరీతమయిన అంచనాలు ఉన్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా సంయుక్త మీనన్, అలాగే ప్రధాన పాత్రల్లో ఆది పినిశెట్టి , హర్షాలీ మల్హోత్రా నటిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ నవంబర్ 28 వ తారీకు వరకు జరుగుతుంది.
“హాయ్ నాన్న” , “సీత రామం” సినిమాలలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ తెరపై తన నటనతో ప్రేక్షకులవద్ద మంచి పేరు సంపాదించారు. ఇటీవల మీడియా తో జరిగిన సంభాషణలో, ఆమె తన బాల్యాన్ని గూర్చి కొన్ని సంఘటనలను, తన కుటుంబంతో తనకున్న సన్నిహిత బంధం, కార్ల పట్ల తనకున్న ప్రేమను గూర్చి ముచ్చటించారు.అలాగే, తాను చిన్నతనంలో తన తల్లికి ఇచ్చిన వాగ్దానం ఆధారంగా తాను కొనుగోలు చేసిన మొదటి లగ్జరీ కారు వెనుక ఉన్న కథ గురించి వెల్లడించారు.
తన టీనేజ్ తొలినాళ్లలోని ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, మృణాల్ ఇలా చెప్పారు,, “నాకు కార్లంటే అంత పిచ్చి ఎందుకు అంటే, దానికి మా అమ్మ ఒక కారణం. నాకు 12 లేదా 13 ఏళ్ల వయసులో, ఆమెను మా బంధువుల కార్లలో కూర్చోనివ్వలేదు, అందుకు నేను చాల భాధ పడ్డాను. ఆ క్షణం నాలో నేను ఒక దృఢ సంకల్పాన్ని ఏర్పరచుకున్నాను. ఎప్పటికైనా నీ కొరకు ఒక మంచి కారును నేను కొంటాను, అని మనసులోనే మా అమ్మకు మాటిచ్చాను.”
ఫిబ్రవరి 2023లో, తన కల నెరవేరింది. మృణాల్ తన తల్లికి మెర్సిడెస్ లగ్జరీ కార్ ని బహుమతిగా ఇచ్చినప్పుడు, షోరూం లోనే తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తల్లి కూతుర్లు ఒకరిని ఒకరు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబంలో మెర్సిడెస్ కారును కలిగి ఉన్న మొదటి అమ్మాయి ఆమే. ప్రస్తుత సమాజంలో బంధువుల మధ్యలో కూడా డబ్బుఉన్నవాళ్లకు ఒక రకమైన విలువ, లేనివాళ్లకు మరొక రకమైన విలువ ఇవ్వటం, మనం చూస్తున్నాం. డబ్బుని బట్టి కానీ, విలువైన వస్తువులను బట్టి గాని, మనుష్యులకు విలువ ఇవ్వటం అనేది తప్పు. మనిషిని మనిషిగా గౌరవించని వాళ్ళు కనీస సంస్కారం లేని వాళ్ళుగా మిగిలిపోతారు.
మృణాల్ కెరీర్ గురించి చెప్పాలంటే, 32 ఏళ్ల ఈ నటి చివరిసారిగా నాగ్ అశ్విన్ కల్కి 2898 AD లో అతిధి పాత్రలో కనిపించింది. ఆమె చేతిలో మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న “పూజా మేరీ జాన్ ” మరియు అడివి శేష్ తో కలిసి నటిస్తున్న “డకాయిట్ ” వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయి.
సింగర్ చిన్మయి భర్త అయిన రాహుల్ రవీంద్రన్ ఒక మంచి నటుడు మరియు దర్శకుడు. గతంలో చాలా సినిమాలో నటించాడు..చాలా సినిమాలకు దర్శకత్వం కూడా చేసాడు. తాజాగా ఈ వారం విడుదల అవుతున్న, రష్మిక నటించిన “ది గర్ల్ ఫ్రెండ్” చిత్రానికి కూడా ఈయనే దర్శకుడు. ఇండస్ట్రీలో ఎంతో కాలం నుండి ఉన్నాడు కాబట్టి ఈయన దగ్గర చాల డబ్బు, ఆస్తులు ఉండి ఉంటాయి… అని అందరు అనుకుంటారు. కానీ, సొంత ఇల్లు కొనుక్కోవడానికి కూడా సరిపడా డబ్బులు నా దగ్గర లేవు, అని ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో నిజాయతీగా చెప్పాడు.
అయితే 2022 ఆగస్టు లో, ఆయన భార్య అయినా చిన్మయి ఒక యూట్యూబ్ ఛానల్ లో చేసిన హోమ్ టూర్ ప్రకారం, వాళ్లకు ఒక మంచి విల్లా వుంది అందులో సుఖంగా,సంతోషంగా ఉంటున్నట్లు వీడియోలో క్లియర్ గా ఉంది. ఈ వీడియో ప్రకారం రాహుల్ అబద్దం చెపుతున్నాడంటూ సోషల్ మీడియాలో ఈ దంపతులను చాల మంది ట్రోల్ చేస్తున్నారు.కొంత మంది మాత్రం సినిమా ఇండస్ట్రీ లో మనుగడ సాధించడం చాల కష్టం అంటూ వాళ్లకు మద్దతుగా నిలుస్తున్నారు.
చిన్మయి శ్రీపాద స్త్రీల హక్కుల కోసం చాలా గట్టిగా పోరాడుతూవుంటారు. సామజిక మాధ్యమాలలో స్త్రీ ల వైపు, చాలా గట్టిగా నిలబబడుతూ..ఆధునిక మహిళగా, చాల మేచుర్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. కొంతమంది సాంప్రదాయ వాదులకు ఆమె వైఖరి అంతగా మింగుడుపడదు. తన భార్యకు మద్దతుగా రాహుల్ కూడా స్త్రీల హక్కులను సమర్ధిస్తూ ఉంటారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ, “మంగళసూత్రం (తాళి) మెడలో వేసుకోవాలా వద్దా అనేది నీ నిర్ణయమే అని నా భార్య చిన్మయికి చెప్పాను. నేనైతే తాళి వేసుకోవద్దనే చెబుతాను. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళిబొట్టు ఉన్నట్లు అబ్బాయిలకు ఏం ఉండదు. ఇది ఓ వివక్ష లాంటిదే. ” అన్నారు. ఇది కూడా చాలా చర్చకు దారితీసింది.
కే రాంప్ సినిమాలో “ఇదేమిటమ్మా మాయ మాయ” పాటకు డాన్స్ చేసిన లుంగీ మామ టీమ్
ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని అందుకున్న కే రాంప్ సినిమాలో ఒక డాన్స్ బిట్ వీడియో వైరల్ అయ్యింది. హీరో కిరణ్ అబ్బవరం తో కలిసి నెల్లూరు లుంగీ మామ చేసిన “ఇదేమిటమ్మా మాయ మాయ” పాట సినిమా విజయానికి ఎంతో ఉపయోగపడింది. ఈ పాట గతంలో Dr.రాజశేఖర్ హీరోగా నటించిన ఆయుధం సినిమాలోది. ఈ పాటలో సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ లు అయిన ఇంస్టాగ్రామ్,యూట్యూబ్ వీడియోలలో పాపులర్ అయినా లుంగీ మామ టీం హీరోతో కలిసి డాన్స్ చేయటంతో, ఈ పాట విపరీతంగా వైరల్ అయ్యింది.
నెల్లూరు లుంగీ మామ అసలు పేరు వెంకటరమణ. ఈయనది మత్స్యకారుల కుటుంబం. నెల్లూరు జిల్లాలోని ఒక మారుమూల పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్నప్పుటినుండి డాన్స్ అంటే పిచ్చి. పాట వినిపిస్తే చాలు డాన్స్ వేయాల్సిందే. ధ్యాసంతా డాన్స్ మీద ఉండటంతో, చదువు మీద ఆసక్తి ఉండేది కాదు, స్కూకి వెళ్ళేవాడు కాదు. అందుకే చదువు అబ్బలేదు. తన బాబాయ్ గోవింద్ ఇచ్చిన ప్రోత్సహం తో డాన్స్ లోని మెళకువలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి డాన్స్ మాస్టర్ గా ఎదిగాడు.
లుంగీ మామకు పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాబు ఇంటర్ చదువుతున్నాడు, పాప 10 వ తరగతి చదువుతుంది. కులవృత్తి అయినా చేపలవేటలో వచ్చే డబ్బులు కుటుంబాన్ని పోషించుకోవటానికి సరిపోయేవికావు. ఒక ఆటో తీసుకొని, కుటుంబ పోషణ కోసం ఆటో డ్రైవింగ్ వృత్తిని చేపట్టాడు లుంగీ మామ.
లుంగీ మామ గ్రామానికే చెందిన మున్నా – నరేందర్ కలిసి రీల్స్ చేసేవాళ్ళు. ఒకరోజు వాళ్ళు వచ్చి కలిసి రీల్స్ చేద్దామని అడిగారు. మిగతా రోజులు పని చేసుకున్నా ఆదివారాలు మాత్రం రీల్స్ చేయటానికి లుంగీ మామను ఒప్పించారు. వీళ్ళు కలిసి చేసిన మొదటి రీల్ కే 4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. దానితో ఆదివారాలు రీల్స్ చేయటం ప్రారంభించారు. లుంగీ పైకి కట్టి..చెప్పులతో..రోడ్ పక్కన ఆయన వేసే స్టెప్స్ , సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆయనను గూర్చి తెలుసుకోవాలనే ఆసక్తి చాలా మందికి కలిగింది. హఠాత్తుగా కిరణ్ అబ్బవరం తో కలిసి “కే రాంప్” సినిమాలో వేసిన స్టెప్స్ వైరల్ కావటంతో ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతున్నారు.
లుంగీ మామ టీం మొత్తం మెగాస్టార్ చిరంజీవి వీరాభిమానులు. ఒకసారి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, నేచురల్ స్టార్ నాని నటిస్తున్న చిత్రంలో స్క్రీన్ టెస్ట్ కోసం వీళ్ళను హైదరాబాద్ కు పిలిపించారు. స్క్రీన్ టెస్ట్ అయినతరువాత చిరంజీవి ఇల్లు ఆ పక్కనే ఉంది అని తెలిసింది. అభిమానులు కావటంతో ఆయన ఇంటి గేట్ దగ్గరకు వెళ్లి సెక్యూరిటీ వాళ్ళకి, చాలా దూరం నుండి వచ్చామని, చిరంజీవి అభిమానులం అని, ఆయనను కలవాలని రిక్వెస్ట్ చేసారు. అయితే చిరంజీవి ఆ సమయం లో ఇంట్లో లేరు, కాబట్టి కలవటం వీలు పడలేదు. అయితే వీళ్ళు నిరుత్సహపడకుండా చిరంజీవి ఇంటి గేట్ ముందు చిరంజీవి పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఒక రీల్ చేసారు. ఆ రీలుకూడా విపరీతంగా వైరల్ అయ్యింది. చిరంజీవిని ఎప్పటికయినా కలవాలని వీళ్ళ ఆశ, ఇప్పటికి తీరక పోయిన, ఎప్పటికయినా ఆయన దృష్టికి వెళితే, కలిసే అవకాశం వస్తుందేమో చూడాలి.
లుంగీ మామ టీం అంతా చాల పేదవాళ్ళు. హైదరాబాద్ వచ్చి సినిమా అవకాశాలకోసం ప్రయత్నించడానికి కనీసం ఛార్జీలకు కూడా డబ్బులు ఉండవు. హైదరాబాద్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ రూముల్లో ఉండి పని చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. స్వతహాగా మత్స్యకార కుటుంబాలు కావటం తో వీళ్లకు నెల్లూరు చేపల పులుసు అంటే చాల ఇష్టం. ప్రతిరోజు చేపల కూర ఉండాల్సిందే. వీళ్ళ టీం లోని సునీల్ మాష్టర్ “తెలుసు కదా”సినిమాలో డాన్స్ మాస్టరుగా అదరకొట్టాడు.
ఎక్కువమందిని ఎంటర్టైన్ చేయాలి అనే ఉదేశ్యంతో వీళ్ళు సాంగ్స్ ని సెలెక్ట్ చేస్తారు. పాటలో ఎనర్జీ, ఎలేవేషన్ మొదలయిన అంశాలు ఉండేటట్లు కంపోజ్ చేసుకుంటారు. ట్రెండ్ ను ఫాలో అవ్వకుండా పాత పాటలతో ట్రెండ్ ని సెట్ చేసారు.
కేరాంప్సినిమాలోఅవకాశంఎలావచ్చిందంటే :
సోషల్ మీడియాలో వీళ్ళ వీడియోలు చూసిన “కే రాంప్” డైరెక్టర్ జైన్స్ నాని వీళ్ళను సంప్రదించాడు. “ఇదేమిటమ్మా మాయా మాయ” పాటను ఆయనే సెలెక్ట్ చేసి ఆ పాటకు డాన్స్ కంపోజ్ చేసుకొని వచ్చి, సినిమాలో డాన్స్ చేయవలసిందిగా కోరాడు. అవకాశాలకోసం ఎదురుచూస్తున్న లుంగీ మామ టీం షూటింగ్ కి వచ్చి, ఆ పాటకు వీళ్ళు కంపోజ్ చేసిన డాన్స్ ను చేసి చూపించారు. కే రాంప్ టీం కు వీళ్ల డాన్స్ నచ్చింది. అంతే, ఎటువంటి మేకప్ లేకుండా , కాస్ట్యూమ్స్ కూడా వాళ్ళు, రోజూ వేసుకొనే కాస్ట్యూమ్స్ తోనే షూటింగ్ చేసేసారు.
ఇటీవల దీపావళికి రిలీజ్ అయిన కే రాంప్ సినిమా అనూహ్యంగా హిట్ అయ్యింది. దానికి ప్రధాన కారణం లుంగీ మామ టీం చేసిన ఆ పాట. ఎక్కడ విన్నా ఆ పాటే . చిత్రం అంత ఘన విజయం సాధించినా కే రాంప్ టీం నుండి కేవలం ప్రయాణం ఖర్చులు మాత్రమే లుంగీ మామ టీంకు వచ్చాయి. ఎటువంటి పారితోషకం ఇవ్వలేదు. అయినా అవకాశం రావటమే ఎక్కువని భావించి తమ పని తాము చేసుకుంటున్నారు లుంగీ మామ టీం. చిత్ర పరిశ్రమ అంతే కదా ! ఎటు చూసినా కథలే మామా ..కడ చేరని కధలే మామా ..!
ఆర్ధికంగా ఉన్నతంగా స్థిరపడిన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆర్ధికంగా నిస్సహాయంగా ఉన్న స్త్రీలకు ఒక అండగా, ఒక కవచంలా ఉండటానికి భరణం ఇవ్వాలని చట్టంలో పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు సమంగా సంపాదిస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సాంఘిక హోదా సమం చేయటానికి భరణం అడగటం అనేది సరికాదు అని కోర్ట్ అభిప్రాయపడింది.
తీర్పులోనిముఖ్యంశాలు :
ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) లో సీనియర్ ఆఫీసర్ గా ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఆమె, అడ్వొకేటుగా ప్రాక్టీస్ చేస్తున్న తన భర్త నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేసులో క్రూరత్వం ఉన్నట్లు గుర్తించిన కోర్ట్ వారికి 2010 లోనే విడాకులు మంజూరు చేసారు. పరస్పర అంగీకారంతో విడాకుల సమయంలో సెటిల్మెంట్ క్రింద భర్త ఆమెకు 50 లక్షల నగదు చెల్లించాడు. విడాకుల అనంతరం ఆమె భర్తనుండి నెల నెలా జీవనభృతి భరణం కోరుతూ మళ్ళీ కోర్టును ఆశ్రయించారు.
ఈ కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తులు అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాధన్ శంకర్ తమ తీర్పును ప్రకటిస్తూ వాస్తవంగా తమను తాము పోషించుకోలేని దుస్థితిలో ఉన్న వ్యక్తులు మాత్రమే భరణం పొందటానికి అర్హులు అని తెలిపారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్ధికంగా వారి దుస్థితిని చట్టం ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్ట్ వారు స్పష్టం చేసారు.
విడాకులు పొందిన వెంటనే ఆటోమేటిక్ గా భరణం వస్తుందని ఎవరయినా అనుకుంటే సరికాదని “భరణం ఒక హక్కు కాదు” అని, ఇద్దరి యొక్క వాస్తవ ఆర్ధిక స్థితిని పరిశీలించి, ఇరువురికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది.
గతంలో పరస్పర అంగీకారంతో 50 లక్షల సెటిల్మెంట్ డిమాండ్ చేసిన భార్యకు, ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కలసి ఉండే ఉద్దేశ్యం లేనందున ఆ మొత్తం డబ్బును భర్త చెల్లించాడు. కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. వీళ్ళు కలసిఉన్నది కేవలం 14 నెలలు మాత్రమే. వీళ్లకు పిల్లలు కూడా లేరు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో విడాకులు మంజూరు చేసినా ఇప్పుడు భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండి, మంచి సంపాదన ఉన్న కారణం చేత ఆమె చేసుకున్న విజ్ఞప్తిని తోసి పుచ్చింది.
ఈ తీర్పు భరణం కొరకు విచ్చలవిడిగా డిమాండ్ చేస్తున్న కొంతమంది మహిళలకు షాక్ అని చెప్పవచ్చు. లగ్జరీల కొరకు, కావాలని కోర్టులకు ఈడ్చి, కోరినంత భరణం పిండుకుందాం అంటే ఇంకా కుదరదు. నిజంగా ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోతే ఆ వివరాలను పరిశీలించి భరణం మంజూరుచేస్తారు కానీ లగ్జరీల కొరకు, విలాసవంతమైన జీవితం కొరకు పీడిస్తామంటే ఇకపై చట్టం వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధించే పరిస్థితి ఉండకపోవచ్చు.
సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శక ధీరుడు S.S.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం #SSMB 29 టీజర్ నవంబర్ నెలలో విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆగష్టు 9,2025 న జరిగిన ఒక ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ ఫస్ట్ అధికారిక టీజర్ నవంబర్, 2025 లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు, ఆ టీజర్ని ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలుస్తుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సినిమా పేరు “గ్లోబ్ ట్రౌటర్” అని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి #SSMB 29 టీజర్ని నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో, 25 వేలమంది అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా రాజమౌళి టీం ఈ డేట్ ని ఇంతవరకు బయటకు అనౌన్స్ చేయలేదు.
ఈ సినిమాకి “వారణాసి” అని “జెన్ 63” అని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఈవెంట్లో సినిమా పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది.
#SSMB 29 సినిమా విశేషాలు :
దర్శకుడు : S.S.రాజమౌళి
తారాగణం : సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు
నేపథ్యం : ఇండియానా జోన్స్ తరహాలో ఆధ్యాత్మిక టచ్ ఉన్న జంగల్ అడ్వెంచర్ మూవీగా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.
నిర్మాణం : కే.ఎల్.నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బేనర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో పురాతన కాశీ నగరాన్ని పోలిన భారీ సెట్ ని కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం హైదరాబాద్ లోనే కాకుండా సౌత్ ఆఫ్రికా, ఒరిస్సాలలో కూడా చిత్రీకరణ జరుపుకుంది.
చైనాకు చెందిన ఒక పేద స్కూల్ విద్యార్థి కథ మరియు అతని ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. చైనాలోని యునాన్ గ్రామీణ ప్రాంతంలో నివసించే ఈ బాలుడు పేరు వాంగ్ ఫుమాన్. -9 డిగ్రీల సెల్సీయస్ చలిలో అడుగు తీసి అడుగు వేస్తే కూరుకుపోయే మంచులో, గడ్డకట్టే చలిలో, దాదాపు 5 కిలోమీటర్లు ఈ బాలుడు నడుచుకుంటూ వెళ్లి తన స్కూలు పరీక్ష వ్రాశాడు. అక్కడికి వెళ్లేసరికి అతని తల మొత్తం తెల్లటి మంచుతో కప్పబడినా, శరీరమంతా ఎర్రగా కందిపోయినా చదువుపట్ల ఆ విద్యార్థి చూపిన ఇష్టాన్ని చూసి ఇప్పుడు అందరూ ముద్దుగా “ఐస్ బాయ్” అని పిలుచుకుంటున్నారు. అంతటి క్లిష్ట పరిస్థితులలో ఆ బాలుడు పరీక్షా వ్రాసినా 100 కి 99 మార్కులు సాధించటం విశేషం.
అతని ఫోటో వైరల్ అవ్వటంతో కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా స్పందించి దాదాపు 4,50,000 డాలర్లను అతని స్కూల్లో హీటర్లు పెట్టటానికి,మరికొన్ని సదుపాయాలకు అలాగే అతనిలాంటి పేద విద్యార్థులకు సహాయంగా అందించారు.
తరువాత ఆ బాలుడు బీజింగ్ ని సందర్శించినప్పుడు అక్కడ ఎండ వేడిని చూసి “వెచ్చదనం ఒక అద్భుతం” అని ఆశ్చర్యంతో వ్యాఖ్యానించాడు. మనకు ప్రకృతి ఎన్నో ఉచితంగా ఇస్తూ ఉంటుంది, కనీసం అటువంటి వాటికి కూడా నోచుకోనివారు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. గడ్డకట్టిన మంచు మీదుగా ప్రతిఫలించిన, ఈ పిల్లవాడు చదువుకోసం చేసిన పోరాటం ప్రపంచం యావత్తునూ కదిలించింది. కృషి,పట్టుదల ఉంటె సాధించలేనిది ఏమి ఉండదని, చదువు విలువని వాంగ్ ఫుమాన్ తెలియచేసాడు.
నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆమె కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు, కానీ ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. తన కెరీర్ ను గమనిస్తే ఆమె సక్సెస్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు ఘన విజయాలు సాధించాయి. మీడియా ఆమెను తన సక్సెస్ సీక్రెట్ ని గూర్చి అడిగినప్పుడు ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కష్టపడి అందరూ పనిచేస్తారు కానీ దానికి కొంచెం అదృష్టం కూడా తోడయితేనే విజయం వరిస్తుంది అని ఆమె నమ్ముతారు. ఇంతవరకు తాను చేసిన సినిమాలు, ఈ పేరు అదంతా ఏమి ప్లాన్ చేసుకుని చేసినది కాదు అని ఆమె చెప్పారు.ఇంకా ఆమె ఏమని చెప్పారంటే –
కష్టపడేతత్వం :
ఒక్కసారి ఒక సినిమా కమిట్ అయినతరువాత చాలా అంకితభావంతో నా పని నేను చేస్తాను. పని విషయంలో నేనొక సైకోని. అంచనాలకు మించి పని చేయటానికి ప్రాధాన్యత ఇస్తాను.
పనికిన్యాయంచేయాలి :
మన పనికి మనం 100% న్యాయం చెయ్యాలి. మనలోని ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించాలి.
ఆనందంగాజీవించాలి :
జీవితంలో ఎప్పుడూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఎన్ని భాదలు ఉన్నా అవి మన పనిలో ఎప్పుడూ కనిపించకూడదు.
అదృష్టం :
మనకు వచ్చిన అవకాశాలను బట్టి కృతజ్ఞత కలిగివుండాలి. నాకు అవకాశాలు రావటం వలన నా ప్రతిభను చూపించుకొనే అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి.
వాస్తవాలనుఅంగీకరించాలి :
జీవితాన్ని ఎప్పుడూ అతిగా ప్లాన్ చేసుకోకూడదు.పరిస్థితులను బట్టి మారి అందుకు అనుగుణముగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు చూడని అవకాశాలు నీకు కన్పించి అదృష్టం వరిస్తుంది.
రోజులుఒకేలాఉండవు :
ఈ రోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు అన్ని పోవటానికి ఒక్క క్షణం చాలు, అది మనసులో పెట్టుకుని గర్వం,అహంకారం లేకుండా మన మూలాలను మరచిపోకుండా సాధారణ జీవితం జీవించాలి, అప్పుడు మన చేతిలో లేని ఏదయినా పరిస్థితులవలన, యేమిజరిగినా, మనకు తట్టుకోగలిగే శక్తి ఉంటుంది.
మద్యం సేవించి వాహనాలను నడిపే వారు తమకేకాక ఇతరులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తారని, కాబట్టి మద్యం సేవించి వాహనాలను నడిపే వాళ్ళను రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సి.సజ్జనార్ తెలిపారు. “మద్యం సేవించి బండి నడిపే వాళ్లకు విచక్షణ ఉండదు. తమ మీద తమకే నియంత్రణ ఉండదు. అందువల్ల వాళ్ళకి, వాళ్ళవల్ల ఇతరులకు ప్రాణ హాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సూసైడ్ బాంబర్ల వలే ప్రమాదకరం. అటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వలన కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రతి పౌరుడు ఒక పోలీసులే. ఒకవేళ ఎవరయినా ఇటువంటి వ్యక్తులను గుర్తిస్తే వారిని గూర్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం పౌరులుగా మీ భాద్యత “అని అన్నారు.
ఇటీవల తాను పోలీస్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరిస్తూ ఈ అత్యుత్తమ వ్యాఖ్యలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో బైకర్స్ మద్యం సేవించినట్లు తేలటంతో ఈ వ్యాఖ్యలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్నూల్ బస్సు దుర్ఘటన తరువాత చాలా మంది సీపీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వం అమ్మితే తప్పు లేనిదీ,తాగితే తప్పేమిటి? అని ప్రజలు భావించేవాళ్లు. కానీ మద్యం అమ్మని దేశం లేదు. ఉదాహరణకు కత్తి అన్ని చోట్లా అమ్ముతారు. దానిని కూరగాయలు తిరగటానికి మంచి పనులకు ఉపయోగించాలి అలా కాదని ఇతరులపై దాడులు చేసేవాళ్లకు జైలు శిక్ష పడుతుంది, తయారు చేసినోడికి లేదా శిక్ష ? అని అడగటం భావ్యం కాదు. మద్యం ఇక్కడ నిషేధిస్తే పక్క రాష్ట్రము వెళతారు ఆలా కాదంటే, ప్రజలే నాటువి, కల్తీవి తయారు చేసి ఇంకా ప్రమాదాలకు కారణమవుతారు. మధ్య నిషేధం అంత సులభమైన పని కాదు. ఇక్కడ మారవలసింది మన ప్రజల మనస్తత్వం..ఆలోచనా విధానం.
కర్నూల్ బస్సు ప్రమాదం లో ఒక తాగుబోతు చేసిన తప్పుకు చిన్నపిల్లలతో సహా 20 మంది సజీవ దహనం అయ్యారు. ఇకపై తాగి వాహనాలు నడిపే వాళ్ళకి ఫైన్ కాదు, సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు జైలుశిక్ష వెయ్యాలి. సజ్జనార్ గారు చెప్పిన వ్యాఖ్యలు నిజమే. వాళ్ళని ట్రాఫిక్ తీవ్రవాదులుగా పరిగణించాల్సిందే.