Home Blog

ఆర్ధిక ఇబ్బందులు లేని భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు. – ఢిల్లీ హైకోర్టు

0

ఆర్ధికంగా ఉన్నతంగా స్థిరపడిన భార్యకు భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆర్ధికంగా నిస్సహాయంగా ఉన్న స్త్రీలకు ఒక అండగా, ఒక కవచంలా ఉండటానికి భరణం ఇవ్వాలని చట్టంలో పెట్టారు. భార్య భర్తలు ఇద్దరు సమంగా సంపాదిస్తున్నప్పుడు, ఇద్దరు వ్యక్తులు సాంఘిక హోదా సమం చేయటానికి భరణం అడగటం అనేది సరికాదు అని కోర్ట్ అభిప్రాయపడింది.

తీర్పులోని ముఖ్యంశాలు :

ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ (IRTS) లో సీనియర్ ఆఫీసర్ గా ఉన్నత ఉద్యోగంలో ఉన్న ఆమె, అడ్వొకేటుగా ప్రాక్టీస్ చేస్తున్న తన భర్త నుండి విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించింది. కేసులో క్రూరత్వం ఉన్నట్లు గుర్తించిన కోర్ట్ వారికి 2010 లోనే విడాకులు మంజూరు చేసారు. పరస్పర అంగీకారంతో విడాకుల సమయంలో సెటిల్మెంట్ క్రింద భర్త ఆమెకు 50 లక్షల నగదు చెల్లించాడు. విడాకుల అనంతరం ఆమె భర్తనుండి నెల నెలా జీవనభృతి భరణం కోరుతూ మళ్ళీ కోర్టును ఆశ్రయించారు.

ఈ కేసును విచారించిన గౌరవ న్యాయమూర్తులు అనిల్ క్షేత్రపాల్, హరీష్ వైద్యనాధన్ శంకర్ తమ తీర్పును ప్రకటిస్తూ వాస్తవంగా తమను తాము పోషించుకోలేని దుస్థితిలో ఉన్న వ్యక్తులు మాత్రమే భరణం పొందటానికి అర్హులు అని తెలిపారు. హిందూ మ్యారేజ్ యాక్ట్ లోని సెక్షన్ 25 ప్రకారం ఆర్ధికంగా వారి దుస్థితిని చట్టం ముందు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది అని కోర్ట్ వారు స్పష్టం చేసారు.

విడాకులు పొందిన వెంటనే ఆటోమేటిక్ గా భరణం వస్తుందని ఎవరయినా అనుకుంటే సరికాదని “భరణం ఒక హక్కు కాదు” అని, ఇద్దరి యొక్క వాస్తవ ఆర్ధిక స్థితిని పరిశీలించి, ఇరువురికి న్యాయం చేయాల్సిన అవసరం ఉందని కోర్ట్ అభిప్రాయపడింది.

గతంలో పరస్పర అంగీకారంతో 50 లక్షల సెటిల్మెంట్ డిమాండ్ చేసిన భార్యకు, ఆమెకు ఎటువంటి పరిస్థితుల్లోనూ కలసి ఉండే ఉద్దేశ్యం లేనందున ఆ మొత్తం డబ్బును భర్త చెల్లించాడు. కోర్ట్ విడాకులు మంజూరు చేసింది. వీళ్ళు కలసిఉన్నది కేవలం 14 నెలలు మాత్రమే. వీళ్లకు పిల్లలు కూడా లేరు. ఈ విషయాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం గతంలో విడాకులు మంజూరు చేసినా ఇప్పుడు భార్య ఉన్నత ఉద్యోగంలో ఉండి, మంచి సంపాదన ఉన్న కారణం చేత ఆమె చేసుకున్న విజ్ఞప్తిని తోసి పుచ్చింది.

ఈ తీర్పు భరణం కొరకు విచ్చలవిడిగా డిమాండ్ చేస్తున్న కొంతమంది మహిళలకు షాక్ అని చెప్పవచ్చు. లగ్జరీల కొరకు, కావాలని కోర్టులకు ఈడ్చి, కోరినంత భరణం పిండుకుందాం అంటే ఇంకా కుదరదు. నిజంగా ఆర్ధిక పరిస్థితి బాగోలేక పోతే ఆ వివరాలను పరిశీలించి భరణం మంజూరుచేస్తారు కానీ లగ్జరీల కొరకు, విలాసవంతమైన జీవితం కొరకు పీడిస్తామంటే ఇకపై చట్టం వాళ్ళను ఎటువంటి పరిస్థితుల్లోనూ సమర్ధించే పరిస్థితి ఉండకపోవచ్చు.

నవంబర్ 15వ తేదీన విడుదల కాబోతున్న #SSMB 29 టీజర్-రామోజీ ఫిలిం సిటీలో 25 వేలమంది అతిధుల సమక్షంలో, ఘనంగా టీజర్ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు

0

సూపర్ స్టార్ మహేష్ బాబు,దర్శక ధీరుడు S.S.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ చిత్రం #SSMB 29 టీజర్ నవంబర్ నెలలో విడుదల అవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఆగష్టు 9,2025 న జరిగిన ఒక ఈవెంట్లో మీడియా అడిగిన ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ ఫస్ట్ అధికారిక టీజర్ నవంబర్, 2025 లో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు, ఆ టీజర్ని ద్వారా సినిమా ఎలా ఉండబోతుందో మీకు తెలుస్తుంది అని చెప్పారు. అప్పట్లో ఈ సినిమా పేరు “గ్లోబ్ ట్రౌటర్” అని కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా అందుతున్న సమాచారాన్ని బట్టి #SSMB 29 టీజర్ని నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో, 25 వేలమంది అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది. అయితే అధికారికంగా రాజమౌళి టీం ఈ డేట్ ని ఇంతవరకు బయటకు అనౌన్స్ చేయలేదు.

ఈ సినిమాకి “వారణాసి” అని “జెన్ 63” అని పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఈవెంట్లో సినిమా పేరు కూడా ప్రకటించే అవకాశం ఉంది.

#SSMB 29 సినిమా విశేషాలు :

దర్శకుడు : S.S.రాజమౌళి

తారాగణం : సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్, మాధవన్ తదితరులు

నేపథ్యం : ఇండియానా జోన్స్ తరహాలో ఆధ్యాత్మిక టచ్ ఉన్న జంగల్ అడ్వెంచర్ మూవీగా ఈ మూవీ రూపుదిద్దుకుంటుంది.

నిర్మాణం : కే.ఎల్.నారాయణ తన దుర్గ ఆర్ట్స్ బేనర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

సంగీతం : ఎం.ఎం.కీరవాణి

ఈ చిత్రం కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో పురాతన కాశీ నగరాన్ని పోలిన భారీ సెట్ ని కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించారు. ఇప్పటివరకు ఈ చిత్రం హైదరాబాద్ లోనే కాకుండా సౌత్ ఆఫ్రికా, ఒరిస్సాలలో కూడా చిత్రీకరణ జరుపుకుంది.

స్కూల్ పరీక్ష వ్రాయటానికి గడ్డకట్టే మంచులో కొన్ని మైళ్ళు నడచివెళ్లిన విద్యార్థి. తలనిండా మంచుతో శరీరమంతా ఎర్రబారినా 100/99 మార్కులు సాధించాడు

0

చైనాకు చెందిన ఒక పేద స్కూల్ విద్యార్థి కథ మరియు అతని ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అయ్యింది. చైనాలోని యునాన్ గ్రామీణ ప్రాంతంలో నివసించే ఈ బాలుడు పేరు వాంగ్ ఫుమాన్. -9 డిగ్రీల సెల్సీయస్ చలిలో అడుగు తీసి అడుగు వేస్తే కూరుకుపోయే మంచులో, గడ్డకట్టే చలిలో, దాదాపు 5 కిలోమీటర్లు ఈ బాలుడు నడుచుకుంటూ వెళ్లి తన స్కూలు పరీక్ష వ్రాశాడు. అక్కడికి వెళ్లేసరికి అతని తల మొత్తం తెల్లటి మంచుతో కప్పబడినా, శరీరమంతా ఎర్రగా కందిపోయినా చదువుపట్ల ఆ విద్యార్థి చూపిన ఇష్టాన్ని చూసి ఇప్పుడు అందరూ ముద్దుగా “ఐస్ బాయ్” అని పిలుచుకుంటున్నారు. అంతటి క్లిష్ట పరిస్థితులలో ఆ బాలుడు పరీక్షా వ్రాసినా 100 కి 99 మార్కులు సాధించటం విశేషం.

అతని ఫోటో వైరల్ అవ్వటంతో కోట్లాది మంది ప్రజలు ప్రపంచవ్యాప్తంగా స్పందించి దాదాపు 4,50,000 డాలర్లను అతని స్కూల్లో హీటర్లు పెట్టటానికి,మరికొన్ని సదుపాయాలకు అలాగే అతనిలాంటి పేద విద్యార్థులకు సహాయంగా అందించారు.

తరువాత ఆ బాలుడు బీజింగ్ ని సందర్శించినప్పుడు అక్కడ ఎండ వేడిని చూసి “వెచ్చదనం ఒక అద్భుతం” అని ఆశ్చర్యంతో వ్యాఖ్యానించాడు. మనకు ప్రకృతి ఎన్నో ఉచితంగా ఇస్తూ ఉంటుంది, కనీసం అటువంటి వాటికి కూడా నోచుకోనివారు ప్రపంచ వ్యాప్తంగా చాలామంది ఉన్నారు. గడ్డకట్టిన మంచు మీదుగా ప్రతిఫలించిన, ఈ పిల్లవాడు చదువుకోసం చేసిన పోరాటం ప్రపంచం యావత్తునూ కదిలించింది. కృషి,పట్టుదల ఉంటె సాధించలేనిది ఏమి ఉండదని, చదువు విలువని వాంగ్ ఫుమాన్ తెలియచేసాడు.

కష్టపడి పనిచేయటం – అదృష్టం కలసిరావటమే నా సక్సెస్ సీక్రెట్ ! రష్మిక

0

నటి, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆమె కెరీర్ లో ఎన్నో ఘనవిజయాలు అందుకున్నారు, కానీ ఆమె చాలా సింపుల్ గా ఉంటారు. తన కెరీర్ ను గమనిస్తే ఆమె సక్సెస్ గ్రాఫ్ చాలా బాగుంటుంది. ఆమె నటించిన సినిమాలు చాలా వరకు ఘన విజయాలు సాధించాయి. మీడియా ఆమెను తన సక్సెస్ సీక్రెట్ ని గూర్చి అడిగినప్పుడు ఆమె చాలా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. కష్టపడి అందరూ పనిచేస్తారు కానీ దానికి కొంచెం అదృష్టం కూడా తోడయితేనే విజయం వరిస్తుంది అని ఆమె నమ్ముతారు. ఇంతవరకు తాను చేసిన సినిమాలు, ఈ పేరు అదంతా ఏమి ప్లాన్ చేసుకుని చేసినది కాదు అని ఆమె చెప్పారు.ఇంకా ఆమె ఏమని చెప్పారంటే –

కష్టపడేతత్వం :

ఒక్కసారి ఒక సినిమా కమిట్ అయినతరువాత చాలా అంకితభావంతో నా పని నేను చేస్తాను. పని విషయంలో నేనొక సైకోని. అంచనాలకు మించి పని చేయటానికి ప్రాధాన్యత ఇస్తాను.

పనికి న్యాయం చేయాలి :

మన పనికి మనం 100% న్యాయం చెయ్యాలి. మనలోని ప్రతిభను పూర్తి స్థాయిలో ప్రదర్శించాలి.

ఆనందంగా జీవించాలి :

జీవితంలో ఎప్పుడూ ఆనందంగా జీవించడానికి ప్రయత్నించాలి. మన జీవితంలో ఎన్ని భాదలు ఉన్నా అవి మన పనిలో ఎప్పుడూ కనిపించకూడదు.

అదృష్టం :

మనకు వచ్చిన అవకాశాలను బట్టి కృతజ్ఞత కలిగివుండాలి. నాకు అవకాశాలు రావటం వలన నా ప్రతిభను చూపించుకొనే అవకాశం వచ్చింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని బట్టి కృతజ్ఞత కలిగి ఉండాలి.

వాస్తవాలను అంగీకరించాలి :

జీవితాన్ని ఎప్పుడూ అతిగా ప్లాన్ చేసుకోకూడదు.పరిస్థితులను బట్టి మారి అందుకు అనుగుణముగా నడుచుకోవాలి. అప్పుడే నువ్వు చూడని అవకాశాలు నీకు కన్పించి అదృష్టం వరిస్తుంది.

రోజులు ఒకేలా ఉండవు :

ఈ రోజు మనం అనుభవిస్తున్న సౌకర్యాలు అన్ని పోవటానికి ఒక్క క్షణం చాలు, అది మనసులో పెట్టుకుని గర్వం,అహంకారం లేకుండా మన మూలాలను మరచిపోకుండా సాధారణ జీవితం జీవించాలి, అప్పుడు మన చేతిలో లేని ఏదయినా పరిస్థితులవలన, యేమిజరిగినా, మనకు తట్టుకోగలిగే శక్తి ఉంటుంది.

మద్యం తాగి రోడ్ల మీదకి వస్తే రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తాం – సీపీ సజ్జనార్

0

మద్యం సేవించి వాహనాలను నడిపే వారు తమకేకాక ఇతరులకు కూడా ప్రాణాపాయం కలిగిస్తారని, కాబట్టి మద్యం సేవించి వాహనాలను నడిపే వాళ్ళను రోడ్ టెర్రరిస్టులుగా భావిస్తామని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ వీ.సి.సజ్జనార్ తెలిపారు. “మద్యం సేవించి బండి నడిపే వాళ్లకు విచక్షణ ఉండదు. తమ మీద తమకే నియంత్రణ ఉండదు. అందువల్ల వాళ్ళకి, వాళ్ళవల్ల ఇతరులకు ప్రాణ హాని అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు సూసైడ్ బాంబర్ల వలే ప్రమాదకరం. అటువంటి నిర్లక్ష్య డ్రైవింగ్ వలన కుటుంబంలో వ్యక్తులను కోల్పోయి, కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉంది. ప్రతి పౌరుడు ఒక పోలీసులే. ఒకవేళ ఎవరయినా ఇటువంటి వ్యక్తులను గుర్తిస్తే వారిని గూర్చి పోలీసులకు సమాచారం ఇవ్వటం పౌరులుగా మీ భాద్యత “అని అన్నారు.

ఇటీవల తాను పోలీస్ కమీషనర్ గా భాద్యతలు స్వీకరిస్తూ ఈ అత్యుత్తమ వ్యాఖ్యలను హైదరాబాద్ సీపీ సజ్జనార్ చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో బైకర్స్ మద్యం సేవించినట్లు తేలటంతో ఈ వ్యాఖ్యలు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కర్నూల్ బస్సు దుర్ఘటన తరువాత చాలా మంది సీపీ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నారు. అంతకు ముందు ప్రభుత్వం అమ్మితే తప్పు లేనిదీ,తాగితే తప్పేమిటి? అని ప్రజలు భావించేవాళ్లు. కానీ మద్యం అమ్మని దేశం లేదు. ఉదాహరణకు కత్తి అన్ని చోట్లా అమ్ముతారు. దానిని కూరగాయలు తిరగటానికి మంచి పనులకు ఉపయోగించాలి అలా కాదని ఇతరులపై దాడులు చేసేవాళ్లకు జైలు శిక్ష పడుతుంది, తయారు చేసినోడికి లేదా శిక్ష ? అని అడగటం భావ్యం కాదు. మద్యం ఇక్కడ నిషేధిస్తే పక్క రాష్ట్రము వెళతారు ఆలా కాదంటే, ప్రజలే నాటువి, కల్తీవి తయారు చేసి ఇంకా ప్రమాదాలకు కారణమవుతారు. మధ్య నిషేధం అంత సులభమైన పని కాదు. ఇక్కడ మారవలసింది మన ప్రజల మనస్తత్వం..ఆలోచనా విధానం.

కర్నూల్ బస్సు ప్రమాదం లో ఒక తాగుబోతు చేసిన తప్పుకు చిన్నపిల్లలతో సహా 20 మంది సజీవ దహనం అయ్యారు. ఇకపై తాగి వాహనాలు నడిపే వాళ్ళకి ఫైన్ కాదు, సంవత్సరం నుండి రెండు సంవత్సరాలు జైలుశిక్ష వెయ్యాలి. సజ్జనార్ గారు చెప్పిన వ్యాఖ్యలు నిజమే. వాళ్ళని ట్రాఫిక్ తీవ్రవాదులుగా పరిగణించాల్సిందే.

కాంతారా హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వేణుగోపాల్ ఎలా చనిపోయారో తెలుసా ?

0

సంచలన హీరోయిన్ రుక్మిణి వసంత్ తండ్రి కల్నల్ వేణు గోపాల్ జమ్మూ కాశ్మీర్ లోని యూరి సెక్టార్ లో ఆర్మీ ఆఫీసర్ గా పని చేసేవారు. 2007 లో ఒకరోజు సరిహద్దుల్లో ఆయన డ్యూటీలో ఉన్నప్పుడు కొంతమంది ఉగ్రవాదులు అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటే ఆయన తన టీం తో కలిసి అడ్డుకున్నారు. అప్పుడు జరిగిన భీకర కాల్పుల్లో దురదృష్టవశాత్తూ కల్నల్ వేణుగోపాల్ తుపాకీ తూటాలు తగిలి చనిపోయారు. తండ్రి చనిపోయినప్పుడు రుక్మిణి వసంత్ వయస్సు కేవలం 11 సంవత్సరాలు మాత్రమే. తండ్రి మరణంతో ఆమె, ఆమె తల్లి మరియు చెల్లి బాధతో తల్లడిల్లిపోయారు.

తదనంతరం భారతదేశ అత్యున్నత పురస్కారం “అశోక చక్ర ” ఆయనకు లభించింది. కర్ణాటక రాష్ట్రము నుండి అశోక చక్ర వచ్చిన మొదటి వ్యక్తి ఆయనే. ఆయన భౌతికకాయానికి మిలటరీ అలంకరణతో, సైనిక లాంఛనాలతో అంత్య క్రియలు జరిగాయి. తాజాగా, కోయంబత్తూర్ లో జరిగిన ఒక ఈవెంట్ లో ఈ సంఘటనను తలచుకుని ఆమె చాలా ఎమోషనల్ అయ్యారు. ” నా తండ్రి చనిపోయినప్పుడు నేను చాల చిన్న దాన్ని. ఆయన మరణం మా కుటుంబం పై చాలా తీవ్రమయిన ప్రభావం చూపించింది. ఆ సమయంలో నా తల్లి అనుభవించిన క్షోభ అంతా ఇంతా కాదు. ఆమె జీవితం మొత్తం శూన్యం గా అయ్యిపోయింది. ఆమె తన భాదను పిల్లలమైన మా కొరకు దిగమింగుకొని ధైర్యం తెచ్చుకొని మమ్ముల్ని ఒక దారి చెయ్యటానికి నిశ్చయించుకుంది. ఆమెకున్న దేశభక్తి చాల గొప్పది. తండ్రి లేని లోటు మాకు తెలియకుండా పెంచింది”

రుక్మిణి వసంత్ తల్లి యుద్ధ సమయంలో భర్తలను కోల్పోయిన వారి కోసం నడిపే “వీర రత్న ఫౌండేషన్ ” లో చాలా యాక్టీవ్ గా తన సేవలను అందిస్తున్నారు. ” మనం అనుభవించిన భాధ, అటువంటి బాధ అనుభవించే ఇతరులతో కలిసి పంచుకుంటే వాళ్ళకి దైర్యం కలుగుతుంది. అమరుల కుటుంబాలతో కలిసి నిర్వహించే మూడు రోజుల వర్కుషాప్ వాళ్ళల్లో చాలా ఓదార్పుని కలిగిస్తుంది. నేను అమ్మ,చెల్లి తో కలిసి ఆ వర్కుషాపులకు హాజరు అయ్యేవాళ్ళం” అని ఆనాటి రోజులను గుర్తుకు తెచ్చుకుంది రుక్మిణి వసంత్.

ఆమె నటించిన “మదరాసి” సినిమా ఇటీవలే విడుదలయ్యింది. రిషబ్ శెట్టి తో కలసి ఆమె నటించిన కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి వెయ్యికోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆమె ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టియార్ నటిస్తున్న “డ్రాగన్” చితం షూటింగ్ లో బిజీగా ఉంది.

మరోసారి హిట్ పెయిర్ బాలయ్య – నయనతార జోడి !

0

వరుస బహుభాషా చిత్రాలలో నటిస్తూ లేడీ సూపర్ స్టార్ నయనతార దూసుకుపోతుంది. ఆమె నటించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తదుపరి చిత్రం #ఎన్ బి కే 111 లో నయనతార హీరోయిన్ గా, బాలయ్యకు పెయిర్ గా నటించడానికి సైన్ చేసారు అనే వార్త బయటకు వచ్చింది. ఈ చిత్రం బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో హిస్టారికల్ కధాంశంతో తెరకెక్కబోతుంది. ఈ చిత్రాన్ని నవంబర్ లో పూజాకార్యక్రమాలతో ఘనంగా ప్రకటించి ప్రారంభించబోతున్నారు.

వీరసింహారెడ్డిఅనంతరం మరోసారి బాలయ్యగోపీచంద్ కాంబో

గోపీచంద్ మలినేని టీం తో బాలయ్య చేస్తున్న రెండవ చిత్రం ఇది. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందువలన #ఎన్ బి కే 111 పై కూడా చాల అంచనాలువుంటాయి. వాటిని అందుకోవటానికి సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం రాజస్థాన్ లో చిత్రీకరణకు అవసరమైన లొకేషన్ల వేటలో చిత్ర యూనిట్ ఉంది.

చారిత్రాత్మక కథతో మొదటిసారి రాబోతున్న గోపీచంద్ మలినేని

ఇంతవరకూ గోపీచంద్ మలినేని తెరకెక్కించినవన్ని కమర్షియల్ చిత్రాలు, మొదటిసారిగా చారిత్రాత్మక కధకు దర్శకత్వం వహించబోతున్నారు మలినేని. ఈ చిత్రం తనకు బాగా అలవాటయిన మాస్ టచ్ తో చారిత్రాత్మకమైన ఒక కథతో, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో ఫాన్స్ ని పలకరించబోతున్నారు మలినేని. ఈ సినిమాలో బాలయ్య గెట్అప్ కూడా ఇంతవరకు ఎవరు చూడని విధంగా ఉండి యాక్షన్, ఎమోషన్, డ్రామా తో చాల రిచ్ గా తెరకెక్కబోతుంది.

బలమైన పాత్ర పోషిస్తున్న నయనతార

గతం లో బాలయ్య నయనతార కాంబినేషన్ లో వచ్చిన లెజెండ్, శ్రీ రామరాజ్యం సినిమాలు మంచి విజయం సాధించడం తో ఫాన్స్ లో ఈ చిత్రం పట్ల చాల అంచనాలు పెరిగిపోతున్నాయి. నయనతార ఒక సినిమా ఓకే చేసారంటే అందులో ఆమెది ఒక బలమైన పాత్ర అయ్యిఉంటుంది. అలాగే ఈ సినిమాలో కూడా స్త్రీ శక్తిని, చారిత్రాత్మక కధలో ఆమె చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబందించిన పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. నవంబర్ లో #ఎన్ బి కే 111 సినిమా చాలా గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించబోతున్నారు.

20 రూపాయల సమోసానా? 3 లక్షల యాంజియోప్లాస్టినా? ఢిల్లీ గుండె జబ్బుల డాక్టర్ మాస్ వార్నింగ్

0

మనలో కొంతమంది ఆఫీసులో సాయంత్రం స్నాక్స్ లాగ కాంటీన్ నుండి సమోసాలు తెప్పించుకుని తినే అలవాటు ఉంటుంది.కొన్ని ఆఫీసులు లో అయితే వాళ్లే సమోసాలు తెప్పించి ఉద్యోగులకు స్నాక్స్ లాగ ఇస్తూఉంటారు. ఇలా రోజు సమోసాలు తినటం ఆరోగ్యానికి మంచిదేనా? దాని పర్యవసానాలు ఎలాఉంటాయి?

ఢిల్లీకి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు డాక్టర్ శైలేష్ సింగ్ ఈ అనారోగ్యకరమయిన అలవాటును గూర్చి ఒక ట్వీట్ చేసారు.ఫన్నీ గా ఉంటూనే డాక్టర్ ఇచ్చిన స్వీట్ హెల్త్ వార్నింగ్ క్షణాల్లో వైరల్ అయ్యి సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. డాక్టర్ సింగ్ ఏమన్నాడంటే – “ఒక సమోసా ఖరీదు 20 రూపాయలు అయితే దానిని ప్రతిరోజూ తినే వ్యక్తి సంవత్సరానికి 300 సమోసాలు తింటాడు. అలా 300 x 20= 6000 రూపాయలు సంవత్సరానికి అవుతాయి. అలా 15 సంవత్సరాలు తింటే 6000 x 15 = 90 వేలు అవుతాయి. ఈ 90 వేలు మీరు అనారోగ్యకరమయిన ఆహారం మీద తీసుకున్న లోన్ దానికి 400 శాతం వడ్డీ అదనం. అలా అనారోగ్యాన్ని కలిగించే ఫుడ్ వలన వచ్చే గుండె జబ్బులకు చికిత్స అయిన యాంజియోప్లాస్ట్య్ కొరకు మీరు చెల్లించవలసిన బాకీ మొత్తం వడ్డీతో కలిపి 3 లక్షలు అవుతుంది”

ఆరోగ్యానికి సంబందించిన నిర్ణయాలను వాయిదా వేయటం, ఈ ప్రాజెక్ట్ అయినతరువాత చూద్దాం, రిటైర్ అయ్యాక హెల్త్ మీద ఫోకస్ చేద్దాం అని విలువయిన సమయం వృధా చేయటం వలన మన శరీరంలో అనారోగ్యం పేరుకు పోతుంది. అనారోగ్యం పాలయినాక ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపించే కంటే ముందే మేలుకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్ కు, మెడికల్ మాఫియాకు మనం ఏటీఎమ్ లాగా మారకుండా ఉంటాము.

మనం తీసుకొనే ఆహరం మీద శరీరంలో కొలస్ట్రాల్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువుగా నూనె,మసాలా కలిగిన ఆహారాల వలన, ఒత్తిడి వలన కొలస్ట్రాల్ పెరిగి కాలేయం, గుండె వ్యాధులు వస్తాయి. శారీరిక శ్రమ, నడక, ఒత్తిడి తగ్గించుకోవటం, మంచి సమతుల్య ఆహరం వలన మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే ఈ సీనియర్ కార్డియోలాజిస్ట్ వైద్యుడు డాక్టర్ సింగ్ చెప్పినది కూడా అక్షరాలా వాస్తవం.

మెగా సంబరం-ట్విన్స్ కు జన్మనివ్వబోతున్న రామ్ చరణ్ దంపతులు

0

అక్టోబర్ 23,2025 న రామ్ చరణ్ ఉపాసన కొణిదెల దంపతులు త్వరలో తమ రెండవ సంతానం గా కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లుగా సోషల్ మీడియా ఇంస్టాగ్రామ్ లో “సీమంతం” బేబీ షవర్ ఫోటోలు మరియు వీడియోలు షేర్ చేసి “ఈ దీపావళికి ప్రేమ,ఆశీస్సులు,వేడుకలు అన్నీ డబల్ అయ్యాయి “అని కాప్షన్ పెట్టారు.తరువాత ఉపాసన తల్లి శోభన కామినేని కూడా త్వరలో కవలలు జన్మిస్తారని ఆశిస్తున్నాము అని ఈ వార్తను ధ్రువీకరించారు.

వీడియోలో ఉన్న సమాచారాన్ని బట్టి ఈ బేబీ షవర్ వేడుక దీపావళి పండుగ సందర్బములో జరిగాయి ,ఈ వేడుకకు రామ్ చరణ్ తల్లి దండ్రులయిన చిరంజీవి,సురేఖ, మెగా కుటుంబ సభ్యులతో పాటు నాగార్జున,వెంకటేష్ కుటుంబాలు,ఇతర శ్రేయోభిలాషులు తరలి వచ్చి రామ్ చరణ్ -ఉపాసన దంపతులను ఆశీర్వదించారు. కోడలు రెండోసారి గర్భం ధరించటం తో చిరంజీవి ఆనందానికి అవధులు లేవు.

2012 లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు మొదటి సంతానంగా క్లిన్ కార కొణెదల జూన్ 2023 లో పెళ్లి అయిన 11 సంవత్సరాల తరువాత జన్మించింది. 2026 లో ఈసారి కవల పిల్లలకు జన్మనివ్వబోతుంది ఉపాసన. పిల్లలను లేట్ గా కనటం పై ఉపాసన గతంలో ఒకసారి స్పందిస్తూ “పిల్లలను ఎప్పుడు కనాలి అనేది స్త్రీల హక్కు. పూర్తిగా ఆరోగ్యం సహకరించినప్పుడే, శారీరకంగా సిద్దపడి, డాక్టర్ సలహాతో పిల్లలను ప్లాన్ చేసుకోవాలి. నేను ఆరోగ్యంగా సిద్ధంగా ఉన్నప్పుడు డాక్టర్ సలహాతో తప్పకుండా మళ్ళీ పిల్లలను కంటాను” అన్నారు.

రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు సానా డైరెక్షన్ చేస్తున్న పాన్ ఇండియా ఫిలిం “పెద్ది” షూటింగ్ లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. గతంలో క్లిన్ కార పుట్టినప్పుడు సినిమాలకు కొంత సమయం విరామం ఇచ్చి సమయాన్ని పూర్తిగా కుటుంబానికే కేటాయించాడు రామ్ చరణ్. ఈసారి కూడా “పెద్ది “సినిమా పూర్తి చేసిన తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకొనే అవకాశం ఉంది.

ప్రేమ ఎటువంటి వ్యక్తినయినా మార్చగలదు – రష్మిక మందన్న.

0

ఒకరిపై మరొకరికి సమానమైన ప్రేమ ఉంటె ఒకరికి తగ్గట్టుగా మరొకరు తప్పకుండా మారతారు.అందుకు మారాలి అని నిజాయితీగా ప్రయత్నం చేయాలి,అమ్మాయిలయినా అబ్బాయిలయినా తప్పకుండ మారతారు. ఒకరిపై మరొకరికి తగినంత ప్రేమ ఉండాలి.ఒక్కరే మారితే ప్రయోజనం లేదు,ఇద్దరూ మారాలి.దానికి సులువయినా మార్గం ఏమిటంటే రెండు మనసులూ కలిసి ఒక్కటిగా మారటమే.
– రష్మిక మందన్న.
జులై 2025 లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నటి రష్మిక మందన్న మాట్లాడుతూ,ఈ వ్యాఖ్యలు చేసారు.ప్రేమను గూర్చి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ కావటంతో అవి సహజంగా మీడియా దృష్టిని ఆకర్షించాయి.అయితే రష్మిక ఈ వ్యాఖ్యలు చేయటానికి కారణం ఏమిటంటే సాధారణంగా రష్మిక మీడియా తో చాల ఫ్రెండ్లీగా ,అందుబాటులో ఉండి చాల విషయాలు పంచుకుంటూ ఉంటారు.ఇటువంటి మీడియా ఇంటర్వ్యూల సందర్భంగా ఆమె నటించిన “యానిమల్ “సినిమాలోని రణబీర్ కపూర్ పాత్రను గూర్చి మీడియా ప్రశ్నిస్తూ “యానిమల్ సినిమాలోని రణ విజయ్ లాంటి వ్యక్తితో ఎప్పుడయినా డేటింగ్ చేస్తారా?”అని అడిగారు.ఆ పాత్ర చాల క్రూరంగా,దూకుడుగా,హింసాత్మకంగా ఉంటుంది.
ఈ ప్రశ్నకు ఆమె బదులిస్తూ ,ఇద్దరు వ్యక్తులు నిజంగా,నిజాయితీగా,సమంగా ప్రేమించుకుంటే కాల క్రమములో వారి వ్యక్తిత్వములో మార్పులు జరుగుతాయని,ఒకరికోసం మరొకరు తప్పకుండ మారతారని రష్మిక స్పందిస్తూ చెప్పింది.కలిసి ఉన్నప్పుడు ఒకరి బలహీనతలు మరొకరు తెలుసుకుంటారని వ్యక్తిత్వములో మార్పులు వస్తాయని సర్దుబాటు చేసుకోవటం కూడా అలవాటు అవుతుందని ఆమె వివరించింది.
ప్రేమ ఎటువంటి వ్యక్తినయినా మార్చగలదని హీరోయిన్ రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవటం వలన చాలామంది నెటిజనులు స్పందిస్తున్నారు.చాలామంది ఆమె వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు.
రష్మిక తన సహా నటుడు టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం చేసుకున్నారనే వార్తల మధ్య అక్టోబర్ 2025 లో ఆమె చేసిన ఈ కామెంట్స్ మళ్ళీ వైరల్ అవుతున్నాయి.అయితే తమ నిశ్చితార్ధాన్ని విజయ్ దేవరకొండ కానీ,రష్మిక గాని ఇంతవరకు ధ్రువీకరించలేదు.కానీ వారి అభిమానులలో మాత్రం వాళ్ళ సంబంధం పట్ల చాల ఆసక్తి నెలకొని ఉంది.